అభివృద్ధి దిశగా పాలమూరు
దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్రలో రూ.10 కోట్లతో మున్సిపాలిటీ సుందరీకరణ, సీసీరోడ్లు, పుట్పాత్, పార్కింగ్, రూ.5 కోట్లతో డ్రెయినేజీల నిర్మా ణం, రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్తోపాటు భూత్పూర్ చౌరస్తాలో రూ.14 కోట్లతో చేపట్టే స్ట్రోం వాటర్ డ్రెయినేజీ, ఊరచెరువు సుందరీకరణ, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్, సారిక టౌన్షిప్లో పార్కు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్సాగర్ రోడ్డుకు, డ్యాం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చా రు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దేవరకద్రకు గుర్తింపు తేవడంతోపాటు డిగ్రీ కళాశాల, కోర్టు, వంద పడకల ఆస్పత్రి తెచ్చామని, సీఐ ఆఫీసు, ఫైర్ స్టేషన్, రిజిష్ట్రేషన్ ఆఫీసు త్వరలో రాబోతున్నాయని చెప్పారు. దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చి ఇప్పటికే రూ.25 కోట్లు తెచ్చామని, ఇంకా కావాల్సిన నిధులు తెచ్చి అందమైన మున్నిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, అరవింద్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, అంజిల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, అంజన్కుమార్రెడ్డి, ఫారుఖ్, బాలస్వామి, వెంకటేశ్, రాఘవేందర్రెడ్డి, రాజశేఖర్, శేఖర్రెడ్డి, భూపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు, తహసీల్దార్ కిషన్ పాల్గొన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో
అభివృద్ధికి పట్టం కట్టండి
రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
అభివృద్ధి దిశగా పాలమూరు
అభివృద్ధి దిశగా పాలమూరు
అభివృద్ధి దిశగా పాలమూరు


