ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది మాట్లాడిన అభిప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నాం. వీడియో చిత్రీకరణ చేశాం. మీటింగ్ మినిట్స్తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం. – సురేష్, ఈఈ, పీసీబీ హైదరాబాద్
ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగు
ఈ ప్రాజెక్టు చిట్టెం నర్సి రెడ్డి కన్న కల. చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి దీనికోసం పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో రాళ్లు తేలిన భూములు కనిపిస్తాయి. వన్యం లేదు.. వన్యప్రాణులు లేవు. నీళ్లు ఉంటే వన్యప్రాణులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యావరణ అనుమతులు ఈ రోజు ఇస్తే ఈ నెలలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించుకునే అవకాశం ఉంది. – కుంభం శివకుమార్రెడ్డి,
డీసీసీ మాజీ అధ్యక్షుడు
●


