
14 ఎకరాలు కోల్పోతున్నాం..
మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వ్యవసాయంతో పాటు ఆయిల్పాం, కాస్మోటిక్ ఆయిల్ మిషన్, గేదెల షెడ్డు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం.
– శ్రీనివాస్రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్కుర్తి
భూమి పోతే బతుకు
కష్టమౌతుంది..
ఉన్న ఎకరన్నర భూమిని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. మాది నిరుపేద కుటుంబం, భూమిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం.
– భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్కుర్తి
●

14 ఎకరాలు కోల్పోతున్నాం..