25లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

25లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్‌ సీజ్‌

Aug 23 2025 3:05 AM | Updated on Aug 23 2025 3:05 AM

25లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్‌ సీజ్‌

25లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్‌ సీజ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల నుంచి తక్కువ ధరకు మద్యం బాటిల్స్‌ విక్రయించి.. వినియోగదారులకు అధిక ధరకు విక్రయించే ఓ వ్యక్తిని ఎకై ్సజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎకై ్సజ్‌ అధికారి సుధాకర్‌ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలోని వందన విహార్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే సుదర్శన్‌రెడ్డి కొన్నిరోజుల నుంచి విశ్రాంత ఆర్మీ అధికారులు, సిబ్బంది వద్ద తక్కువ ధరకు మద్యం బాటిల్స్‌ కొనుగోలు చేసి మార్కెట్‌లో అవసరమున్న వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో శుక్రవారం అతని ఇల్లు తనిఖీ చేయగా.. 33డిఫెన్స్‌ మద్యం బాటిల్స్‌ దాదాపు 25లీటర్లు లభ్యం కాగా.. వాటిన సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.90వేల వరకు ఉంటుందని తెలిపారు. సుదర్శన్‌రెడ్డిపై రెండునెలల నుంచి నిఘా పెట్టామని, అతను కొందరు ఆర్మీ ఉద్యోగులు ఆర్మీ క్యాంటీన్‌లో మద్యం వినియోగించుకోకుండా తమ కోటాలో వచ్చిన మద్యం బాటిళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారులకు గుట్టుగా సరఫరా చేస్తున్నాడని వెల్లడించారు. ఇకపై ఆర్మీ ఉద్యోగులపై అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టణంలో కొందరు నిర్వహించే ఫంక్షన్స్‌, పార్టీల్లో డిఫెన్స్‌ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలిందని, ఇలాంటి సందర్భాల్లో పట్టుబడితే ఫంక్షన్‌ హాలు నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఫెన్స్‌ మద్యం లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే 8712658872కు తెలియజేయాలని పేర్కొన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సీఐ వీరారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ కవిత, ఎస్‌ఐ రాజేందర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పాలమూరులో గుట్టుగా దందా

నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement