
జూరాలకు 90 వేల క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో 1.15 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో 90 వేల క్యూసెక్కులకు చేరినట్లు చెప్పారు. దీంతో 8 క్రస్ట్ గేట్లు పైకెత్తి 52,758 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 32,399 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, ఆవిరి రూపంలో 47, కుడి కాల్వకు 470, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు తెలిపారు.
విద్యుదుత్పత్తి వేగవంతం..
ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 208.889 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 248.715 మి.యూ. విద్యుదుత్పత్తి చేపడుతున్నామని ఎస్ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 457.604 మి.యూ. విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామని తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 32 వేల క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు
శ్రీశైలం జలాశయానికి..
దోమలపెంట: శ్రీశైలం జలాశయానికి ఆదివారం జూరాల ఆనకట్ట స్పిల్వే ద్వారా 52,758 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 32,399 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 66,176 క్యూసెక్కుల వరద చేరింది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,399 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 880.6 అడుగుల నీటిమట్టం.. 191.2118 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 32 వేల క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతలకు 2,818, ఎంజీకేఎల్ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.232 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 14.741 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టారు.
8 క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల