
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
నగరంలోని వివిధ డివిజన్ల పరిధిలో నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఎక్కడైనా నాసిరకం పనులు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు. పాత పాలమూరులో పగిలిపోయిన సిమెంట్ పైపులను తొలగించి కొత్తవి వేయిస్తాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్