
హోర్డింగ్లతోనే ఆదాయం
సుమారు 5 కి.మీ. పొడవున ఉన్న ఎన్హెచ్–167పై 30 చోట్ల, దీనికి ఇరువైపులా ఉన్న బహుళ అంతస్తులపై 74 చోట్ల వివిధ సైజుల్లో హోర్డింగ్లను 13 యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. అలాగే ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు ఎదురుగా ఉన్న ఐడీఎస్ఎంటీ కాంప్లెక్స్పై డిజిటల్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశారు. ఆయా ప్రైవేట్ కంపెనీలు వివిధ ప్రాంతాల్లో సుమారు 80 సెల్ టవర్లు నిర్మించాయి. వీటి ద్వారా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు 2021–22లో మొత్తం రూ.15,74,000 ఆదాయం వచ్చింది. 2022–23లో రూ.15,40,800, 2023–24లో రూ.29,63,500 సమకూరింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తున్నా ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు ఇంకా లెక్కలు తేల్చలేదు.