రూ.7లక్షల విలువైన 47 ఫోన్ల రికవరీ | - | Sakshi
Sakshi News home page

రూ.7లక్షల విలువైన 47 ఫోన్ల రికవరీ

Mar 20 2025 1:05 AM | Updated on Mar 20 2025 1:04 AM

నారాయణపేట: మొబైల్‌ పోయిన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో కానీ సీఈఐఆర్‌ వెబ్‌ పోర్టల్‌ లో కానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొబైళ్లు పోగొట్టుకున్న 47 మంది బాధితుల మొబైల్‌ ఫోన్లను కనిపెట్టి తిరిగి ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో 47 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. మొబైల్‌ ఫోన్లను బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఎవరు పాత మొబైల్‌ ఫోన్లను కొనరాదన్నారు. మొబైళ్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన ఐటి కోర్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement