తల్లికి చికిత్స కోసం వెళ్తుండగా.. విషాదం! | Sakshi
Sakshi News home page

తల్లికి చికిత్స కోసం వెళ్తుండగా.. విషాదం!

Published Fri, Aug 4 2023 12:32 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: కారు, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన మండలంలోని మంతన్‌గోడ్‌లో గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని మాన్వి పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం మంతన్‌గోడ్‌ చెందిన తిరుపతమ్మ పెరాలసిస్‌తో బాధపడుతుంది.

చికిత్స కోసం కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్‌ జిల్లాలోని ఆయుర్వేద వైద్యం చేసుకుంటుంది. రెండోసారి తిరుపతమ్మ, ఆమె ఇద్దరు కుమారులు రాకేష్‌గౌడ్‌, నరేందర్‌గౌడ్‌ తోపాటు వారి బంధువు కృపాకర్‌గౌడ్‌(25) కార్వార్‌ జిల్లాకు మంతన్‌గోడ్‌ నుంచి కారులో బయలుదేరారు.

మాన్వి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బొలెరో వాహనం వీరి కారును ఢీకొనడంతో కృపాకర్‌గౌడ్‌ మృతి చెందగా, నరేందర్‌గౌడ్‌కు స్వల్పంగా, రాకేష్‌గౌడ్‌, తిరుపతమ్మకు తీవ్రంగా గాయాలయ్యాయి. తిరుపతమ్మను హైదరాబాద్‌కు, మిగతా ఇద్దరు రాయచూర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు మాన్వి ఎస్‌ఐ హిరేమత్‌ తెలిపారు. కృపాకర్‌గౌడ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement