లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

మరిపెడలో ఘటన

మరిపెడ : లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మరిపెడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం దబ్బతండాకు చెందిన బానోత్‌ వెంకట్రాం(45) పనుల నిమిత్తం బైక్‌పై మండల కేంద్రానికి వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఖమ్మం నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలికి ఎస్సై గండ్రాతి సతీశ్‌ చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement