గరుడ వాహనంపై పాండురంగడు | - | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై పాండురంగడు

May 14 2025 2:09 AM | Updated on May 14 2025 2:09 AM

గరుడ వాహనంపై పాండురంగడు

గరుడ వాహనంపై పాండురంగడు

కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీ సెంటర్‌ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులచే నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. బుధవారం గజేంద్ర వాహనంతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement