
సచివాలయ వ్యవస్థతో వేలాది ఉద్యోగాలు
2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించింది. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాల కల్పనకు కారణమయ్యారు. ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నూతన సాంకేతిక ఒరవడితో ఆన్లైన్ సదుపాయం కల్పించారు. ఎంపీడీఓల పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల జిల్లా పరిషత్లలో పీఆర్కు చెందిన వారే సీఈఓ, డిప్యూటీ సీఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు.
– జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
మూడంచెల పీఆర్ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో 1.20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా వివిధ ప్రభుత్వ సేవలను గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలోనే అందించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ప్రకారం ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ వల్ల ఎంతో మేలు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీఓలకు పదోన్నతులు లభించాయి.
– జీ జయపాల్రెడ్డి, రిటైర్డు జెడ్పీ సీఈఓ,
ఎస్ఐఆర్డీ తెలంగాణ కన్సల్టెంట్
●

సచివాలయ వ్యవస్థతో వేలాది ఉద్యోగాలు