
తల్లి కష్టంతో చదివి
తల్లి వద్ద విద్యార్థి ప్రేమ్ గణేష్
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వీవర్స్ కాలనీ జెడ్పీ హైస్కూల్లో చదివిన ప్రేమ్ గణేష్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 588 మార్కులు తెచ్చుకున్నారు. కుర్ణికులానికి చెందిన తన తండ్రి ఎం.శివకుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఎమ్మిగనూరు శివన్న నగర్లో నివాసం ఉండే తల్లి శ్రావణి టైలర్గా పనిచేస్తూ కుమారుడు ప్రేమ్ గణేష్ను చదివించింది. తల్లి కష్టంతో చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన తాను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని ప్రేమ్ గణేష్ తెలిపారు.