
66.01 ఉత్తీర్ణత శాతం
జిల్లాలో అత్యధిక మార్కులు
సాధించిన విద్యార్థులు
పగిడాల గీతిక (597)
షేక్ మహమ్మద్ (597)
వెంకట కీర్తన (597)
టి.గాయత్రి (597)
సలీమా (597)
జి.నందు (597)
హరిణి (597)
సాయి నందిని (596)
వెంపలి రస్మితారెడ్డి (596)
రత్నపల్లి మనుచరణ్ (596)
పి.రాజ్వాన (596)
షేక్ తస్రీన్ (596)
నేహాతాళ యాస్మిని (596)
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల ఫలితాల పెంపునకు కూటమి ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తయారు చేసి అమలు చేసింది. అయితే ఆ ప్రణాళిక అమలుపై క్షేత్ర స్ధాయిలో సరైన పర్యవేక్షణ లోపించింది. కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో చదువులను విస్మరించింది. పశ్చిమ పల్లెల నుంచి వలస వెళ్లిన విద్యార్థులను గుర్తించి సకాలంలో వెనక్కి తీసుకు రాలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల ఫలితాలు అశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 3.53 శాతం పెరిగింది. గత నెల 17 నుంచి 30వ తేది వరకు 172 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 3 నుంచి 9వ తేది వరకు ముల్యాంకనం చేపట్టారు. గతేడాది 62.47 శాతంతో జిల్లా చిట్టచివరి స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది 66.01 శాతం ఉత్తీర్ణతతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక పదవ తరగతి పరీక్షలంటే సాధారణంగా బాలికలదే పైచేయి ఉంటుంది. తాజా ఫలితాల్లోనూ బాలికలే ముందంజలో నిలిచారు. మొత్తం విద్యార్థుల్లో 14,291 మంది ఫస్ట్ క్లాసు, 3,904 మంది సెకెండ్ క్లాస్, 2,389 మంది థర్డ్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు.
సత్ఫలితాలిచ్చిన ఎన్సీఈఆర్టీ సిలబస్
పాఠశాల విద్యలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశ పెట్టింది. ఈ సంస్కరణ తీసుకొచ్చిన తరువాత నిర్వహించిన పది పరీక్షల్లో ఫలితం స్పష్టంగా కనిపించింది. ఇంగ్లిష్ మీడియంలో రాసిన విద్యార్థులు తెలుగు మీడియం వారి కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణులు కావడమే ఇందుకు కారణం. ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారు సుమారు 85 శాతం ఉత్తీర్ణులు కాగా.. తెలుగు మీడియం విద్యార్థులు 40 శాతం కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోనే అత్యధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
34 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
జిల్లాలో 517 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, 34 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణతలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు, బనవాసి), ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలురు, కాల్వ బుగ్గ), మహత్మజ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ స్కూల్(బాలికలు, ఆరేకల్లు), ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్(కర్నూలు), కేజీబీవీ క్రిష్ణగిరి, కేజీబీవీ పంచలింగాల స్కూల్కి చెందిన విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు టి.సాయి లిఖిత 592 మార్కులు(ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్), వై.దేవిక 576 మార్కులు సాధించారు. మూడు కార్పొరేట్, 23 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి.
● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు 16 ఉన్నాయి. ఈ స్కూళ్ల నుంచి 1,333 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 930 మంది పాసయ్యారు. కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్కి చెందిన జి.సోహాల్ 583 మార్కులు సాధించారు.
కేజీబీవీల్లో..
జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన 978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 774 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పంచలింగాల, క్రిష్ణగిరి కేజీబీవీలో 100 శాతం అత్యధికంగా, కోసిగిలో అత్యల్పంగా 43 శాతం ఉత్తీర్ణత సాధించారు. వై.దేవిక అత్యధికంగా 576 మార్కులు సాధించింది. 75 మందికి 500 మార్కులకు పైగా వచ్చాయి.
మున్సిపల్ హైస్కూళ్లు..
జిల్లాలో మున్సిపల్ హైస్కూళ్లకు చెందిన 1,838 మంది విద్యార్థుల్లో 961 మంది ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ స్కూల్లో 43 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. 42 మంది 500 మార్కులకు పైగా సాధించడం విశేషం.
● ఎయిడెడ్ స్కూళ్లకు చెందిన 187 మందిలో 102 మంది పాసయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన బి.హేమప్రియకు 570 మార్కులు వచ్చాయి(సెయింట్ జోసెఫ్ హైస్కూల్, చిల్డ్రన్స్ పార్క్).
● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 91 మందిలో 60 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆలూరు స్కూల్కి చెందిన పి.అంజలి 564 మార్కులు అత్యధికంగా సాధించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 544 మందిలో 483 మంది ఉత్తీర్ణులు కాగా.. బిక్యాంపు రెసిడెన్షియల్ స్కూల్కి చెందిన ఎం.ప్రమీలా 587 మార్కులు సాధించింది. బీసీ వెల్ఫేర్ స్కూళ్లకు చెందిన 227 మందిలో 221 మంది ఉత్తీర్ణులైయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన జి.హాసిని 592 మార్కులు సాధించారు.
● ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 374 మంది పరీక్షలు రాయగా, 360 మంది పాసయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్, మహత్మజ్యోతిరావు ఫూలే స్కూల్ ఆరెకల్లులో 100 శాతం ఫలితాలు వచ్చాయి. పంచలింగాల స్కూల్ విద్యార్థి 592 మార్కులు సాధించారు.
● డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాలు 8 ఉన్నాయి. ఈ స్కూళ్లకు చెందిన 1,002 మంది పరీక్షలకు హాజరుకాగా 919 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 771 మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
31,185
పరీక్షకు హాజరైన విద్యార్థులు
20,584
ఉత్తీర్ణులైన విద్యార్థులు
60.36
బాలుర ఉత్తీర్ణత శాతం
(9,854 మంది)
72.21
బాలికల ఉత్తీర్ణత శాతం
(10,730 మంది)
బనవాసికి గురుకులానికి మరోసారి ‘వంద’నం
ఎమ్మిగనూరురూరల్: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బనవాసి గురుకుల పాఠశాల ఫలితాలను సాధిస్తోంది. బుధవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు వందశాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించి తమ సత్తా మరోసారి చాటుకున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గురుకుల పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పాఠశాల 2007 నుంచి వరుసగా 18 సంవత్సరాలుగా వందశాతం ఉత్తీర్ణతను సాధిస్తూ వస్తోంది. ఈ ఏడాది వై. శ్రీవాణి 583, జి. నందిని 576, బి. కీర్తన 573, టి. బిందు 570, డీఎస్ భాగ్యశ్రీ 567, కె. సుమయ్యతప్సం 566, పి. గీతాంజలి 559, పి. నందిని 559, వై.నందిని 558 మార్కులు సాధించారు. ప్రతి సారి ఇలాంటి ఫలితాలే వస్తున్నాయని ప్రిన్సిపాల్ సామ్రాజ్యం తెలిపారు.

66.01 ఉత్తీర్ణత శాతం