ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Apr 21 2025 8:05 AM | Updated on Apr 21 2025 8:05 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

కోడుమూరు రూరల్‌: వెల్దుర్తి నుంచి కోడుమూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు, కోడుమూరు నుంచి వెల్దుర్తి వైపు వెళుతున్న లారీ వెంకటగిరి గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు రక్త గాయాలవ్వగా, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సింగల్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్‌ ఇద్దరూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు.

రైలు పట్టాలపై వృద్ధుడి

మృతదేహం

నంద్యాల: పట్టణంలోని గురురాజ పబ్లిక్‌ పాఠశాల సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్‌ఐ జలీల్‌ తెలిపారు. వృద్ధుడి వయస్సు 70 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు ఎరుపు రంగు పంచ, పచ్చరంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. వృద్ధుడు మృతి చెంది నాలుగు రోజులు కావస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మృతదేహానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వైన్‌షాప్‌ సమీపంలో

వ్యక్తి మృతి

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని అగ్నిమాపక కేంద్రం ఎదరుగా ఉన్న వైన్‌షాప్‌ సమీపంలో ఆదివారం రాత్రి కురవ అడివప్ప(58) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు..పెద్దకడుబూరు మండలం హెచ్‌.మురవణి గ్రామానికి చెందిన కురవ అడివప్ప(58) ఉదయం ఎమ్మిగనూరుకు వచ్చాడు. ఫైర్‌ స్టేషన్‌ ఎదురుగా వున్న వైన్‌ షాప్‌కు సమీపంలోని కూల్‌డ్రింక్‌ షాప్‌ పక్కన కూర్చొని ఉన్నాడు. వర్షం ప్రారంభం కావటంతో అక్కడ ఉన్న వారు తలదాచుకునేందుకు వైన్‌షాప్‌ దగ్గరకు పరుగులు తీశారు. వర్షం తగ్గాక వచ్చి చూడగా కూల్‌డ్రింక్‌ షాప్‌ దగ్గర కూర్చున్న కుర వ అడివప్ప స్పృహతప్పి పడిపోయి ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నా రు. అడివప్ప మృతికి కారణాలపై విచారిస్తున్నా మని ఎమ్మిగనూరు రూరల్‌ పోలీసుల తెలిపారు.

వాగులో పడ్డ ఆటో

పాణ్యం: మండల పరిధిలోని అనుపూరు గ్రామం వద్ద ఉన్న కొర్రవాగులో ఓ ఆటో పడి ప్రయాణికులకు గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినింది.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ 1
1/1

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement