వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పందిళ్లలో గణనాథుడిని భక్తులు దర్శించుకొని, మనసారా పూజించి తరిస్తున్నారు. కొన్ని చోట్ల స్వామి వారిని విభిన్నంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. మచిలీపట్నంలోని చమనగిరిపేటలోని ఓ పందిరిలో శుక్రవారం వినాయక విగ్రహాన్ని రూ. ఆరు లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. నోట్లతో తయారుచేసిన గజమాలను వేశారు. అలంకరణకు కరెన్సీ నోట్లతో పాటు పది రూపాయల నాణేలను కూడా ఉపయోగించారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. – మచిలీపట్నంటౌన్


