55 వేల ఎకరాల్లో మామిడి.. | - | Sakshi
Sakshi News home page

55 వేల ఎకరాల్లో మామిడి..

Apr 24 2025 1:26 AM | Updated on Apr 24 2025 1:26 AM

55 వేల ఎకరాల్లో మామిడి..

55 వేల ఎకరాల్లో మామిడి..

ఎన్టీఆర్‌ జిల్లాలో 55 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి సాగు అధికంగా ఉంది. గత నెలరోజుల్లో నాలుగుసార్లు గాలిదుమ్ములతో కూడిన వర్షాలు పడటంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా ఏప్రిల్‌ నెలలో మామిడి కోతలు ప్రారంభమై మే నెలాఖరుతో ముగుస్తాయి. అంతకుముందు మంచు కారణంగా పూత రాలింది. పూత నిలిచేందుకు రైతులు 5 నుంచి 10సార్లు మందులు స్ప్రే చేశారు. ఇందుకు అదనంగా రైతుకు ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేలు పెట్టుబడి అయింది. తరువాత మంగు తెగులు కారణంగా కొంతనష్టం వాటిల్లింది.

గాలులు, వానలకు పెనుగంచిప్రోలులో నేలరాలిన మామిడి కాయలు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement