ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు

ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు

ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులను గురువారం అందజేశారు. పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా డెప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ టి.సాయిచరణ్‌ తేజ పాల్గొని కార్డులు పంపిణీచేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగులకు గుర్తింపు కార్డులను ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు రెన్యూవల్‌ చేసేవారని, అయితే అవి త్వరగా పాడయ్యేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పీవీసీ కార్డులు మంజూరు చేయాలని కోరారని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం దీనికి సమ్మతించి ఐదేళ్లు చెల్లుబాటయ్యేలా పీవీసీ కార్డులను తయారు చేయించి పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమయిన తరువాత సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ సహా ఉద్యోగుల వివరాలను ఈ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌లో పొందుపరిచామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్సనల్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, సుపరింటెండెంట్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జోగి రమేష్‌ బెయిల్‌పిటీషన్లపై తీర్పు వాయిదా

విజయవాడలీగల్‌: వుద్యం అక్రమ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి రాము, జోగి రమేష్‌, దారబోయిన ప్రసాద్‌ తరఫున దాఖలైన బెయిల్‌ పిటీషన్లపై గురువారం విచారణ పూర్తయింది. ఎకై ్సజ్‌ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు తీర్పును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. సయ్యద్‌ హాజీ, కట్టా రాజు, మిథున్‌ దాస్‌, అంతాదాస్‌ తరఫున దాఖలైన బెయిల్‌ పిటీషన్లపై ప్రాసిక్యూషన్‌ కౌంటర్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల 12వ తేదీకి, షేక్‌ అల్లాభక్షు తరఫున దాఖ లైన బెయిల్‌ పిటీషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయా లని ఆదేశిస్తూ ఈ నెల 19వ తేదీకి ఎకై ్సజ్‌ కోర్టు న్యాయూర్తి లెనిన్‌బాబు వాయిదా వేశారు. ఈ కేసులో జినేష్‌, షీబు నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎకై ్సజ్‌ పోలీసులు ఎౖక్సైజ్‌ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్‌పై డిఫెన్స్‌ న్యాయవాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ కౌంటర్‌ నిమిత్తం ఈ నెల 12వ తేదీకి వాయిదా చేశారు. అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు, తలారి రంగయ్య, బాలాజీ, సుదర్శన్‌ తరఫున దాఖలైన బెయిల్‌ పిటీషన్లపై ప్రాసిక్యూషన్‌ న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయడంతో న్యాయ మూర్తి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement