పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి
మునిసిపల్ కమిషనర్లకు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశం
పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పోలీస్ స్టేషన్ పరిధి పాయకాపురం ప్రాతానికి చెందిన నిరజ హత్య కేసులో ఆమె భర్త వడ్డాది దుర్గారావు (39)కు మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. 2020వ సంవత్సరం ఎల్బీఎస్ నగర్, పాయకాపురానికి చెందిన వడ్డాది దుర్గారావుకు నీరజను ఇచ్చి పెద్దల సమక్షంలో రెండో వివాహం చేశారు. దుర్గారావు చెడు వ్యసనాలకు బానిసై భార్యను సరిగా చూసుకోకుండా అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో 2021, మే ఐదో తేదీన నీరజను భర్త కత్తితో పొడిచి చంపేశాడు. అదే నెల ఏడో తేదీన నింది తుడిని అప్పటి సీఐ హనీష్బాబు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, జరిమానా విధించారు.
కంచికచర్ల: సంక్రాంతి పండుగ సందర్భంగా, సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డీసీపీ బి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కీసర టోల్ప్లాజా వద్ద డివిజన్ పోలీస్ అధికారులు, రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులు, నేష నల్ హైవే అథారిటీ అధికారులు, టోల్ప్లాజా అధికారులతో గురువారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాల డీసీపీ సూచించారు. అనంతరం 47వ భద్రతా మాసో త్సవాలు కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ పోలీస్ అధికారులతో కలసి పాల్గొన్నారు. వాహనదారులందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్, నందిగామ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పూర్ణిమ, నందిగామ టౌన్, నందిగామ రూరల్ సీఐలు వై.వి.ఎల్.నాయుడు, డి.చవాన్, పలువురు ఎస్ఐలు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.


