
రూ.లక్షకు పైగా నష్టం తప్పేలా లేదు
ఈ ఏడాది ఐదెకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. గాలిదుమ్ములు రాక ముందు టన్ను రూ.లక్ష వరకు ఉంది. ఇప్పుడు టన్ను రూ.30వేలు నుంచి రూ.40వేలు మాత్రమే ఉంది. ఐదెకరాలపై రూ.లక్షకుపైగా నష్టం వచ్చేలా ఉంది. ధర పెరిగితేనే నష్టాల ఊబి నుంచి గట్టెక్కగలం.
– దారా వెంకటేశ్వర్లు, కౌలురైతు, పెనుగంచిప్రోలు
అనుకూలించని వాతావరణం
ఈ ఏడాది మామిడికి వాతావరణం అనుకూలించలేదు. పూత ఆలస్యం కావడంతోపాటు పూత దశలో నల్లతామర, మంగుపురుగు, తెగుళ్లతో కాపు తగ్గింది. కోత సమయంలో గాలులు, వానలకు అధికశాతం కాయ నేలరాలింది. తెగుళ్ల నివారణ మందులు కొట్టేందుకు ఎకరానికి రూ.20వేలు దాకా ఖర్చులు అయ్యాయి.
– తిరుపతిరావు, కౌలు రైతు, పెనుగంచిప్రోలు
●

రూ.లక్షకు పైగా నష్టం తప్పేలా లేదు