దహెగాం: మండల కేంద్రానికి చెందిన గురిజాల రాజబాబు జానపద కళా కారుల సంఘం జిల్లా అ ధ్యక్షునిగా ఎన్నికయ్యా రు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రపంచ కళాకారుల దినోత్సవ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్గౌడ్, కార్యదర్శి హనుమండ్ల మధూకర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు రాజబాబు తెలిపారు. జి ల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుని గా రాజబాబు ఎన్నిక కావడంపై మండల వా సులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ.. జానపద కళలను కాపాడడానికి కృషి చేస్తానని తెలిపారు.


