జిల్లాకు చేరిన స్టాంప్ పేపర్లు
ఆసిఫాబాద్: జిల్లాలో మూ డు నెలలుగా వేధిస్తున్న స్టాంప్ పేపర్ల కొరత ఎట్టకేలకు తీరింది. ఈ నెల 14న సాక్షి దినపత్రికలో ‘స్టాంపు పేపర్లకు కటకట’ పేరుతో ప్రచురితమైన కథనానికి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్కు ఇండెంట్ పెట్టారు. మంగళవారం సాయంత్రం రూ.20, రూ.50, రూ.100 బాండ్పేపర్లు ప్రత్యేక వాహనంలో జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు.


