
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్రూరల్: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే బస్సు ఫిట్నెస్, సరైన ధ్రువపత్రాలు సరి చూసుకోవాలన్నారు. డ్రైవర్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, డ్రైవింగ్ సమయంలో మత్తు పానీయాలు సేవించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మోహన్, రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.