
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గతనెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించిన ఆ టో రథయాత్ర బుధవారం బెల్లంపల్లికి చేరుకు ంది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్, నా యకులు, ఆటో డ్రైవర్లు రథయాత్ర కు స్వా గతం పలికారు. బజారుఏరియా పురవీఽ దుల మీదుగా రథయాత్ర, ఆటోలతో ర్యాలీ చేశారు. రథయాత్ర మే 27న హైదరాబాద్కు చేరుకుంటుందని, ఈసందర్భంగా ఇందిరాపార్కులో ని ర్వహించే ఆటో ఆకలి కేకలు మహాసభకు ఆటో డ్రైవర్లు తరలిరావాలని కోరారు.