
భూభారతితో రైతులకు మేలు
పెంచికల్పేట్/కౌటాల: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పెంచికల్పేట్, కౌటాలలోని రైతువేదికల్లో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, నూతనంగా వచ్చిన భూభారతి చట్టంతో ఆ సమస్యలు తొలగిపోతాయన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి ప్రతీ గ్రామంలో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు భూమితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందన్నారు. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పని ప్రదేశాల్లో టెంటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఏడీ మనోహర్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్లు వెంకటేశ్వర్రావు, పుష్పలత, ఎంపీడీవోలు అల్బర్ట్, రమేశ్, ఏవోలు మనీషా, ప్రేమలత, ఎస్సై కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.