
సమగ్ర వివరాలు నమోదు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రధాన మంత్రి గతిశక్తి పోర్టల్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం గతిశక్తి వివరాల నమోదుపై గురువారం విద్య, వైద్యం, శిశు సంక్షేమం, రహదారులు, తాగునీటి శాఖల అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలల వివరాలు, జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ర హదారులు, తాగునీటి వనరుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. తద్వారా సౌకర్యాలు లేని గ్రామాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ జిల్లాస్థాయి అధికారికి లాగిన్ ఐడీ ఉండాలని, పోర్టల్లో 70 మంత్రిత్వ శాఖల వివరాలు ఉంటాయన్నారు. వివరాల నమోదులో శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, ఇన్చార్జి డీఈవో ఉదయ్బాబు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, పంచాయతీరాజ్ ఇంజినీర్లు ప్రభాకర్, కృష్ణ, ఈ డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్కుమార్, పీఎం జన్మన్ సమన్వయకర్త మణివేలు తదితరులు పాల్గొన్నారు.