
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సోమవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్కు వినతిపత్రం అందించారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 12 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొమురయ్య, పార్వతి, లక్ష్మి, జ్యోతి, శారద, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.