
నీరు లేక నిర్జీవం
● కళావిహీనంగా జోడేఘాట్ పార్క్ ● సంరక్షణకు నోచుకోని మొక్కలు ● వెలవెలబోతున్న మానవ ఆకృతి ● లోపించిన అధికారుల పర్యవేక్షణ
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ నినా దంతో నైజాం సర్కారును గడగడ లాడించిన కు మురంభీం పురిటి గడ్డ జోడేఘాట్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్క్లో నాటిన మొక్కలు సంరక్షణకు నోచుకోక ఎండిపోయాయి. 2016 అక్టోబర్లో అధికారులు 29,750 మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యత మరిచిపోయారు. దీంతో మొక్కలన్నీ నీరందక నిర్జీవమై పోయాయి. ప్ర స్తుతం 100 మొక్కలైనా కనిపించడం లేదు. ఏటా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు కూడా సంరక్షణకు నోచుకో ఎండిపోయాయి.
ఆదరణకు నోచుకోక..
జోడేఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పార్క్లో వంద రకాల ఔషధ మొక్కలతోపాటు సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా నాటారు. పార్క్లో మానవాకృతి ని నిర్మించారు. ఏ ఔషధ మొక్క ఏ అవయవానికి మేలు చేస్తుందో అందరికీ తెలిపే ప్రయత్నం చేశా రు. ఒక్కో అవయవం వద్ద ఒక్కో రకమైన ఔషధ మొక్క నాటారు. మిగతా స్థలంలో సుగంధ, సీతా ఫలం, జామ, మామిడి, కానుగ మొక్కలతో పాటు 150 ఆపిల్ మొక్కలూ నాటారు. మొక్కలకు నీటిని అందించేందుకు ఓ కూలీని నియమించారు. కానీ.. అనతి కాలంలోనే నీళ్లు లేక మొక్కలు ఎండిపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. పక్కనే ని ర్మించిన లోటస్ ఫాండ్ నీరు లేక వెలవెలబోతోంది.
అలంకారప్రాయమైన బోరు
గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉంది. తాగడానికే నీరు దొరకని పరిస్థితి. గతంలో ఐటీడీఏ, టూ రిజం శాఖ అధికారులు నాటిన మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేసిన బోరు ప్రస్తుతం నిరుపయోగమైంది. భూగర్భజలం అడుగంటి చుక్కా నీరు లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది కూడా అలంకారప్రాయమైంది. దీంతో మొక్కలు చనిపోవడానికి నీరు లేకపోవడం ఓ కారణమైతే, అధికారుల నిరాదరణ మరో కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలని కోరుతున్నారు.
కంచె ఏర్పాటు చేయాలి
గతంలో ఏర్పాటు చేసిన పార్క్ ప్రస్తుతం మొక్కలు లేకుండా కళావిహీనంగా కనిపిస్తోంది. కంచె ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలకు రక్షణ లేకుండా పోయి ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటి బోరు నిరుపయోగమైంది. అధికారులు స్పందించి మళ్లీ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి.
– పెందోర్ రాజేశ్వర్, జోడేఘాట్
భూగర్భజలాలు అడుగంటి..
పార్క్లో గతేడాది 3,200 మొక్కలు నాటాం. కంచె లేకపోవడంతో వాటికి రక్షణ కరువైంది. గతంలో పార్కులోని మొక్కల రక్షణకు ఓ వ్యక్తిని నియమించారు. కానీ.. ప్రస్తుతం నిధులు లేక రెండేళ్ల నుంచి రక్షణ కరువైంది. బోరు నీరు అడుగంటింది. భూగర్భం జలాలు ఇంకి ఇబ్బంది తప్పడం లేదు.
– మల్లయ్య, ఈజీఎస్ ఏపీవో, కెరమెరి

నీరు లేక నిర్జీవం

నీరు లేక నిర్జీవం

నీరు లేక నిర్జీవం