
పోరాడితేనే ఆదివాసీలకు మనుగడ
● తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచయ్య ● జోడేఘాట్లో ముగిసిన రాష్ట్ర మహాసభలు
కెరమెరి(ఆసిఫాబాద్): హక్కులు, చట్టాల రక్షణ కోసం పోరాడితేనే ఆదివాసీలకు మనుగడ అని తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచ య్య, రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్కుమార్ అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. వారు మాట్లాడుతూ రాంజీగోండు, కుమురంభీం హక్కుల సాధన కోసం చేసిన ప్రాణత్యాగం వృథా కావొద్దన్నారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, నాయకులు నగేశ్, రఘుపతిరావు, రవి, బాపు, నరసింహరావు, కిశోర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గుర్రాల రవీందర్, ఈసం నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బాపు, మెస్రం మోతీ రాం, పెందోర్ జలపతి, సోయం రాజేందర్, జంగు, పెందోర్ ధర్మూ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిబో యిన లక్ష్మీనారాయణ, కార్యదర్శులుగా ఆలం కిశోర్, కుడ్మెత తిరుపతి, ఆత్రం రవీందర్, పెందోర్ మారుతి, కోశాధికారిగా చందా రఘుపతిరావు, కార్యవర్గ సభ్యులుగా సోయం జంగు, ధారబోయిన రమేశ్, ఆత్రం బిర్సను ఎన్నుకున్నారు.