సమానత్వం కోసం పూలే కృషి | - | Sakshi
Sakshi News home page

సమానత్వం కోసం పూలే కృషి

Apr 12 2025 2:40 AM | Updated on Apr 12 2025 2:40 AM

సమానత

సమానత్వం కోసం పూలే కృషి

ఆసిఫాబాద్‌: సమాజంలో సీ్త్ర పురుష సమానత్వం, దళిత, గిరిజన వర్గాల సంక్షేమం కోసం మహా త్మా జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, బీజేపీ సీని యర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, మాలి సంక్షేమ సంఘం నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమానత్వం, సమసమాజం కోసం పూలే రెండు దశాబ్దాల క్రితమే పోరాటాలు చేసి, ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. కుల వివక్షతను ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన.. వివక్షతను అంతం కావాలని పరితపించారన్నారు. అసమానతలు, కుల వ్యవస్థ అంతం చేయాలని నిర్ణయించుకుని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మహిళలు చదువకూడదనే రోజుల్లో ఆయన భార్య సావిత్రీబాయికి గురువై, దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిని అందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ పూలే సేవలు కొనియాడారు. మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి సజీవన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్నులె మెంగాజీ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్‌ రమేశ్‌, నాయకులు నాయకులు శెండెవాసు, నాగోశ శంకర్‌, బాలేశ్‌గౌడ్‌, మల్లేశ్‌, మారుతి పటేల్‌, రేగుంట కేశవరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

సమానత్వం కోసం పూలే కృషి1
1/1

సమానత్వం కోసం పూలే కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement