
‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన
కౌటాల/పెంచికల్పేట్: సమీకృత గురుకుల విద్యాలయం ఏర్పాటు కోసం గురువారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి కౌటాల మండలం కనికి, పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడలో స్థలాలు పరిశీలించారు. కనికిలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడంతోపాటు బొంబాయిగూడలో సర్వే నంబర్ 177లో స్థలం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 15 నుంచి 25 ఎకరాల స్థలం అవసరమవుతుందని తెలిపారు. స్థల పరిశీలన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఆయ న వెంట తహసీల్దార్లు పుష్పలత, వెంకటేశ్వరరావు, ఎంపీడీవో అల్బర్ట్, సిబ్బంది ఉన్నారు.