ఎల్‌ఆర్‌ఎస్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ వేగవంతం చేయాలి

Mar 22 2025 1:54 AM | Updated on Mar 22 2025 1:48 AM

ఆసిఫాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం సబ్సి డీ ఉంటుందని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌– 2002 పథకం కింద 3,499 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి 2,993 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 116 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారన్నారు. గ్రామ పంచాయతీల్లో 3,665 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా 2,299 అర్హత ఉన్నవిగా గుర్తించామని తెలిపారు. వీరిలో 229 మంది ఫీజు చెల్లించారన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement