వ్యక్తిగత పరిశుభ్రత కీలకం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత పరిశుభ్రత కీలకం

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

ఖమ్మంరూరల్‌: బాలికలు వ్యక్తిగత శుభ్రత పాటించడం కీలకమని డిప్యూటీ కలెక్టర్‌ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల సూచించారు. ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలోని టీజీఎస్‌జేసీజీలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌, డీడబ్ల్యూఓ మాట్లాడుతూ విద్యార్థినులకు రుతుస్రావ సమయాన వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాక శానిటరీ ప్యాడ్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అలాగే, పోషకాహారం తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ విషయమై బాలికల్లో అవగాహన పెంచేలా ఉపాధ్యాయినులు కూడా కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీలత, మెడికల్‌ ఆఫీసర్‌ కనకదుర్గ, అధ్యాపకులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement