ఖమ్మం సహకారనగర్: సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్బూరి నరహరి, బానోతు భిక్షం నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాక కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018ను రద్దు చేయాలని, లేకపోతే సవరించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఉపసర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేసి, పెండింగ్ బిలుల్లు విడుదల చేయాలన్నారు. అలాగే, మైనర్ పంచాయతీలకు రూ.5లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.10లక్షలు కేటాయించాలని కోరారు.


