సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు | - | Sakshi
Sakshi News home page

సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

చింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ ప్రాంగణంలో భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. ప్రాంగణం, పార్కింగ్‌ స్థలంతో పాటు భోజనశాల వద్ద ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, పేపర్‌ ప్లేట్లు పోగయ్యాయి. ఈ మేరకు మధిర, చింతకాని, ముదిగొండ, బోనకల్‌, ఎర్రుపాలెం మండలాల్లోని గ్రామపంచాయతీల నుంచి వంద మంది పారిశుద్ధ్య కార్మికులతో శనివారం ఉదయం చెత్త తీయిస్తూ ట్రాక్టర్ల ద్వారా డంప్‌ యార్డులకు తరలించారు. ఈ మేరకు పనులను జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు పరిశీలించారు. సభా ప్రాంగణం పూర్తిస్థాయిలో శుభ్రం అయ్యేవరకు పనులు కొనసాగుతాయని తెలిపారు. మరోపక్క సభావేదిక, జర్మన్‌ హ్యాంగర్లతో ఏర్పాటు చేసిన గుడారాలను సైతం తొలగిస్తున్నారు.

పరిశీలించిన డీపీఓ రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement