ఇన్నాళ్లు స్కూల్ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. తొలిసారి ఇంటర్ విద్యార్ధులకు భోజనం, ఉదయం టిఫిన్ పెట్టాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. దీంతో సమయం ఆదా అయి చదువుపై శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది.
– శ్రీరంగం యశ్వంత్,
ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బోనకల్
ప్రభుత్వం అల్పాహారం పథకాన్ని మా నియోజకవర్గంలోనే మొదటగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నాణ్యతనే కాక ఎంతో రుచిగా ఉండడంతో అందరం ఇష్టంగా తిన్నాం. ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి గారికి కృతజ్ఞతలు. – అవ్వారి కుందన,
ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బోనకల్
కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహారం పథకం మాకెంతో ఉపయోగపడుతుంది. ఇది మా వంటి పేద విద్యార్థులకు వరం లాంటిది. ఈరోజు టిఫిన్ రుచికరంగా ఉంది. ఇకపై మరింత ఉత్సాహంగా చదువుకునే అవకాశముంటుంది. – జి.ధనుష్,
పదో తరగతి, జెడ్పీహెచ్ఎస్, ముదిగొండ


