ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంను రెండు చీలుస్తూ వెళ్తున్న రైల్వే లైన్లో భాగంగా మధ్య గేట్ వద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కమాన్బజార్, గాంధీచౌక్ ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ప్రధాన మార్గమైన గేట్ను నాలుగు నెలలుగా మూసేయడంతో వ్యాపార లావాదేవీలు స్తంభిస్తున్నాయని తెలిపారు. కాగా, రైల్వే శాఖపై రాజ్యసభలో జరిగిన చర్చలోనూ ఎంపీ రవిచంద్ర ఈ అంశాన్ని ప్రస్తావించారు. మూడో లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాక గేట్ స్థానంలో ఆర్ఓబీ లేదా అండర్ పాస్ నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ వినతి