ఖమ్మం మామిళ్లగూడెం: ప్రవక్త మహమ్మద్ ఉల్లేఖనం ప్రకారం ముస్లింలు ఏ ప్రదేశంలో పుడితే అదే వారి మాతృభూమి అని.. తద్వారా భారత్లో పుట్టిన ముస్లిం, మైనార్టీలంతా భారతీయులే అయినందున మాతృభూమిని ప్రేమించడం కర్తవ్యమని ప్రవచనకారుడు, పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుల్ రెహమాన్ తెలిపారు. ఖమ్మంలో డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ ది రిలీఫ్ అండ్ ఎడ్యుకేషనల్(డేర్) ఆధ్వర్యాన శనివారం ఇఫ్తార్ విందుతో పాటు సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో రెహమాన్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం ‘డేర్’రాష్ట్ర కార్యదర్శి నోమాన్ రిజ్వీ, ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణ, డాక్టర్ జగదీష్ మాట్లాడారు. ఈసదస్సులో వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వర్లు, కూరపాటి ప్రదీప్కుమార్, రవికుమార్, జంగాల సునీల్, కిరణ్, కుప్పు ధనమూర్తి, సురేందర్, సురేష్, తేజ, బాబు రత్నాకర్, విజయలక్ష్మి, పుష్పలతతో పాటు డాక్టర్ అన్వర్, ఆరిఫ్, ముస్తాక్, ఫయాజ్, గులాం షరీఫ్, మన్సూర్ ఇలాహి తదితరుల పాల్గొన్నారు.