యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద విచారించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుడు దర్శన్ కోర్టులో స్వయంగా హాజరు కావాలని ఆయన న్యాయవాది వాదించారు. జడ్జి స్పందిస్తూ దర్శన్ను కోర్టుకు తీసుకొస్తే పోలీసు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది, జనం రద్దీని అడ్డుకోవడం కష్టమని అన్నారు. వీలైతే పరప్పన అగ్రహార జైలులోనే విచారణ జరపవచ్చు. వ్యక్తిగత హాజరు కంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. ఇరువర్గాలూ మాట్లాడుకుని ఒక తీర్మానానికి రావాలని, వాయిదాలకు ప్రతిసారీ నిందితులు రావాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పడం గమనార్హం.
వన్యప్రాణుల కేసు?
మైసూరు జిల్లా టి నరసీపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫౌంహౌస్లో గతంలో అరుదైన పక్షులు, వన్యజీవులు ఉన్నట్లు వీడియోలు వచ్చాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
జన రద్దీతో ఇబ్బందులేమో?
హైకోర్టు జడ్జి సందేహం


