గుంతల రోడ్డుకు ఉద్యోగిని బలి | - | Sakshi
Sakshi News home page

గుంతల రోడ్డుకు ఉద్యోగిని బలి

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్‌ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్‌ సిటీలోని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్‌ ఆఫీసులో ఉద్యోగిని. వివరాలు.. మేధ తన స్నేహితుడు అజయ్‌ గురుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోంది. ఈ సమయంలో, ముందు వెళ్తున్న కారు డ్రైవర్‌ గుంతను చూసి హఠాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న అజయ్‌ బైక్‌ గాభరాపడి బ్రేక్‌ నొక్కగా అదుపుతప్పి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఓ గూడ్స్‌ వ్యాన్‌ మేధ మెడపై నుంచి దూసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది.

స్థానికుల నిరసన

ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డును దిగ్బంధించారు. కొవ్వొత్తులు వెలిగించి, మేధ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఎలక్ట్రానిక్‌ సిటీ పరిసరాల్లోని రోడ్లు చాలా అధ్వాన్నంగా, గుంతలతో నిండి ఉన్నాయని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని కోరారు. హెబ్బగోడి, ఎలక్ట్రానిక్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

కారు బ్రేక్‌ వేయగా కింద పడ్డ బైక్‌

ఆమైపె నుంచి వెళ్లిన వ్యాన్‌

బెంగళూరులో విషాద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement