కాయక వర్గ పెన్నిధి నులియ చందయ్య | - | Sakshi
Sakshi News home page

కాయక వర్గ పెన్నిధి నులియ చందయ్య

Aug 12 2025 10:00 AM | Updated on Aug 12 2025 10:00 AM

కాయక వర్గ పెన్నిధి నులియ చందయ్య

కాయక వర్గ పెన్నిధి నులియ చందయ్య

హొసపేటె: విశ్వగురు బసవణ్ణ వచన ఉద్యమంలో ప్రముఖ దార్శనికుడు, వచన రచయిత నులియ చందయ్య దేశ కాయక వర్గానికి ప్రతినిధిగా నిలిచారని, ప్రగతిశీల మేధావి అని అనంతనాయక్‌ అభివర్ణించారు. నగరంలోని అమరావతి పర్యాటక మందిరంలో జరిగిన శరణ నులియ చందయ్య జయంతిలో ఆయన మాట్లాడారు. నులియ చంద్రయ్య ఆదర్శాలు మనందరికీ అనుసరణీయమన్నారు. నులియ చందయ్య కేవలం ఒక సమాజానికే పరిమితం కాకుండా ఈ భూమి మొత్తం కాయక మతానికి ప్రతిబింబం అన్నారు. అహింద ఉద్యమ దృక్పథం ఇప్పుడు మనందరికీ గతంలో కంటే చాలా అవసరం. ఆ విషయంలో మనమందరం చురుకుగా ఉండాలని ఆయన అన్నారు. వెనుకబడిన తరగతుల మహాకూటమి నాయకులు గాళి భరమణ్ణ, ఇర్ఫాన్‌, ముదగల్‌ గౌడ, సోమశేఖర్‌, రామచంద్రప్ప, బాణద గణేష్‌, శివకుమార్‌, స్లం వెంకటేష్‌, వీరభద్రప్ప నాయక, సన్న మారప్ప, ప్రమోద్‌ పుణ్యమూర్తి, చలవాది మహాసభ సన్న మారెప్ప, జయప్ప, జేసీ ఈరన్న, జేసీఈ ఈరన్న గిరీష్‌, కే.తిమ్మారెడ్డి, గాయకుడు యల్లప్ప భండారి, యాదవ సంఘం నాయకుడు మధుసూదన్‌, మహిళా నాయకురాలు హులిగెమ్మ, హరూన్‌ షేక్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement