పులి కనిపించిందని పుకార్లు
మండలంలోని రుక్మాపూర్, కాట్నపల్లి గ్రా మాల మధ్య పులి కని పించిందని ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కారులో వెళ్లేవారు ఫోన్లో బందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రుక్మాపూర్లో డప్పు చాటింపు కూడా చేయించడం గమనార్హం. అటవీశాఖ అధికారులు ఓ వైపు పెద్దపల్లి జిల్లాకు పులి వెళ్లినట్లు అనుమానిస్తుండగా, గ్రామాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పులి ఆనవాళ్లు కనిపిస్తున్నా, అది ఎక్కడ సంచరిస్తోందో పూర్తి సమాచారం వస్తే గానీ ఈ పుకార్లకు పుల్స్టాప్ పడే అవకాశం లేదు.


