పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ మ్యాపింగ్ చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బుధవారం బల్దియా కార్యాలయంలోని సమావేశ మందిరంలో 66 డివిజన్లకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ ఆన్లైన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ పోర్టల్లో ఓటర్ల డేటాను పొందుపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇచ్చిన డేటాలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ల ప్రకారం పొందుపరచాలని సూచించారు. ప్రతీ ఓటర్ డేటాను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఈ మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, టౌన్ప్లానింగ్ ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య తదితరులు ఉన్నారు.
నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్


