
ఆనంద పరమార్థమే కృష్ణ లీల
శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ప్రయోజనాలు వేర్వేరు. ఆదర్శ మానవుడికి ప్రతీక శ్రీరాముడు. అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కర్మయోగి, కష్టసుఖాల ఎరగక అలసట తెలియక పనులు చేసి ఉచ్చనీచాలన్నీ భరించాడు. లోకోద్ధరణ కృష్ణావతార పరమార్థం. ఉపనిషత్తులు, వేదాల సారాన్ని అందరికీ విడమరిచి అందుబాటులో ఉండేట్లు భగవద్గీతగా చెప్పాడు. జ్ఞానం కంటే పవిత్రమైంది వేరేది లేదు. ఆత్మ జ్ఞానం లభించిన వాడు శాంతి పొంది చివరకు భగవంతుని చేరగలడని జగత్తుకు ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు జగద్గురువైయ్యాడు.
– పవనకృష్ణశర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్