భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని.. | - | Sakshi
Sakshi News home page

భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని..

Apr 29 2025 12:12 AM | Updated on Apr 29 2025 12:12 AM

భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని..

భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని..

● మానేరుడ్యాంలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు సేవ చేయలేనని, తాను కూడా అనారోగ్యానికి గురవుతున్నానని మనస్తాపం చెందిన భార్య మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎల్‌ఎండీ పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గుగ్గిళ్లకు చెందిన నర్సమ్మ(60) భర్తకు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. కొడుకులు ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భర్తతో పాటు నర్సమ్మ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తన భర్తను సమర్థవంతంగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపానికి గురైంది. కొడుకులు సైతం దూరంగా ఉండడంతో ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచింది. ఏప్రిల్‌ 27న సాయంత్రం 4 గంటల సమయంలో నర్సమ్మ శ్రీకరీంనగర్‌ వెళ్లి వస్తాన్ఙు అని భర్తకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త కొడుకులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. సోమవారం మానేరు డ్యాంలో ఆమె మృతదేహం తేలింది. మృతురాలి చిన్న కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుతో ఎల్‌ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement