
మారుమోగిన శివనామస్మరణ
వేములవాడ: ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. సోమవారం 50వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు క్యూలైన్లను కట్టడి చేశారు. భక్తుల ద్వారా రూ.55లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శంకర జయంతి వేడుకలు ప్రారంభం
రాజన్న సన్నిధిలో ఐదు రోజులపాటు జరిగే శంకర జయంతి వేడుకలు సోమవారం అద్దాల మంటపంలో ఇన్చార్జి స్థానాచార్యులు ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో ఆరంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. శంకరాచార్య సహస్ర నామ పారాయణం, శివగీత–శివసహస్ర నామ పారాయణం జరిపించారు.
● దర్శించుకున్న 50 వేల మంది భక్తులు

మారుమోగిన శివనామస్మరణ