ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
Breadcrumb
- HOME
సమ్మక్క– సారలమ్మకు జాతరకు వెళ్తూ కోడిపుంజు ఇలా..
Published Wed, Jan 10 2024 1:18 AM
Related news
-
నేను.. పక్కా లోకల్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్లో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముందుగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగతం పలికారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకక, బయటి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని, అందుకే మాజీ సర్పంచ్లు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులను కట్టిందన్నారు. పల్లెల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్లను నిలువునా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కరీంనగర్ ఎంపీగా నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ‘హుస్నాబాద్ ఎమ్మెల్యే నన్ను వెధవ అంటున్నారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నన్ను ఎంత తిట్టినా పడతా’నని బండి అన్నారు. హామీలపై మొదట శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..! -
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Related News by category
-
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
బండి, గంగుల ఒక్కటే
● వినోద్ను ఓడించింది వాళ్లే ● ఇద్దరూ కలిసే నగరాన్ని దోచుకున్నారు ● తీగలవంతెనపై విచారణ జరుగుతోంది ● మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక్కటేనని, ఇద్దరు కలిసి నగరాన్ని దోచుకున్నారని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉప్పు నిప్పులా ఉన్న గంగుల, బండి పాలు నీళ్లలా ఎందుకు కలిసిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి వినోద్కుమార్ను ఓడించారన్నారు. నగరంలో భూ కబ్జాలపై స్థానిక ఎంపీగా సంజయ్ ఎందుకు మాట్లాడడంలేదన్నారు. స్మార్ట్సిటీ, గ్రానైట్ అక్రమాలపై ప్రశ్నించాల్సిన ఎంపీ ఎందుకు మౌనంగా ఉన్నాడని, ఎంపీ విధానాలను నిలదీయాల్సిన ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎన్నిలకు ముందు సంజయ్ ఆస్కార్అవార్డు స్థాయిలో నటిస్తారని, ఒకసారి భార్య తాళి అమ్ముకున్నానని, మరోసారి ఎంఐఎం దాడి చేసిందని, ఇంకోసారి మూర్చవచ్చి పడిపోతాడన్నారు. నగరాన్ని లండన్ చేస్తాం, అద్ధంలా మారుస్తామని కేసీఆర్ చెప్పారని ఏమైందన్నారు. తీగలవంతెన నిర్మాణ అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు లోపలికి పోవుడేనన్నారు. తాము అధికారంలోకి రాగానే భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేసి చూపిస్తున్నామని, అదే కాంగ్రెస్ పాలన అని చెప్పారు. భూ కబ్జాల్లో ఎవరు జైలుకు వెళ్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఏ పార్టీ వాళ్లయినా భూ ఆక్రమణలకు పాల్పడితే వాపసు ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగిశాక నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement