
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం ధాన్యం సేకరణే అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు తాడ్వాయి మండల కేంద్రం నుండి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్త మ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లులకు బ్యాంక్ గ్యారెంటీల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వ డం కుదరదని స్పష్టం చేశారు. అవసరమైతే ధాన్యాన్ని గోదాములకు తరలించాలని అన్నారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
జిల్లాలో ఇప్పటివరకు 446 కొనుగోలు కేంద్రాల ద్వారా 22,785 మంది రైతుల నుంచి 1,81,776 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. 1,01,038 మె ట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.234.41 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, 5,315 మంది రైతులకు సన్న ధాన్యానికి రూ.25.89 కోట్ల బోనస్ చెల్లించామని వివరించారు. ఆర్డీవో వీణ, డీఎస్వో మల్లికార్జున్బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహకార అధికారి రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్డీవో సురేందర్, డీపీవో ము రళి, మార్కెటింగ్ అధికారిణి రమ్య పాల్గొన్నారు.
ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత
అంశం ధాన్యం సేకరణే..
బ్యాంక్ గ్యారెంటీల అంశంలో
రైస్మిల్లర్లకు మినహాయింపు ఉండదు
వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్