
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 95 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెడిపోయిన మున్సిపల్ నీటి బోరు
కామారెడ్డి టౌన్: పట్టణంలోని 26వ వార్డు శేర్గల్లిలో గత 40రోజులుగా మున్సిపల్ నీటి మోటారు, షార్టర్ చెడిపోయింది. దీంతో కాలనీవాసులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు నెల రోజులుగా విన్నవించినా పట్టించుకోవడం లేరని కాలనీవాసులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బల్దియా స్థలంలో
బోరుకు అనుమతి ఇవ్వాలి
మున్సిపాలిటీకి చెందిన స్థలంలో బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రం లోని అశోక్ నగర్ విద్యాభారతి పురం సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజావాణికి తరలి వచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో తీవ్రమైన నీటి సమస్య ఉందన్నారు. బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
ప్రజావాణికి 95 వినతులు..

సమస్యలను వెంటనే పరిష్కరించాలి