దుకాణ యజమానులకు జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

దుకాణ యజమానులకు జైలుశిక్ష

Apr 29 2025 8:15 AM | Updated on Apr 29 2025 8:15 AM

దుకాణ

దుకాణ యజమానులకు జైలుశిక్ష

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని రంగర్‌గల్లికి చెందిన పవన్‌ చారీ తన బంగారు దుకాణాన్ని, శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన షేక్‌ యాకూబ్‌ తన మిల్క్‌ డైరీని, అలాగే ఓ బేకరీ యజమాని రాత్రి వేళలో సమయానికి మించి దుకాణాలను తెరిచి ఉంచినందున పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పర్చగా బేకరి యజమానికి రెండు రోజుల జైలు, మిగిలిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వదల్‌పర్తి గ్రామశివారులోని వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పోచబోయిన భాస్కర్‌, ఎక్కపల్లికి చెందిన ఎల్లమోల్ల సాయిలు వదల్‌పర్తి శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే వారిని, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం కొడిచర్ల గ్రామ శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

నిజాయితీ చాటిన హోటల్‌ యజమాని

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఓ మహిళ హోటల్‌లో మర్చిపోయిన బంగారు అభరణాలను హోటల్‌ యజమాని బాధిత మహిళకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం కుప్రియల్‌ గ్రామానికి చెందిన సైదగారి బాలమణి ఆదివారం మధ్యాహ్నం నిజాంసాగర్‌ బస్టాండ్‌లో బస్సుదిగింది. అనంతరం సమీపంలోని హోటల్‌లో టిఫిన్‌ తినడానికి వెళ్లింది. అదే సమయంలో బంగారు చెవి కమ్మలను హోటల్‌లో మర్చిపోయి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి కమ్మలు కనిపించకపోవడంతో బంధువులకు తెలపగా, వారు హోటల్‌ యజమానికి ఫోన్‌లో సంప్రదించారు. యజమాని కమ్మలను భద్రంగా ఉంచాడు. బాధితురాలిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి చెవి కమ్మలను అందజేశాడు.

పేకాడుతున్న పలువురి అరెస్టు

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని దేవివిహార్‌ ఫేస్‌–3 కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 60,400 నగదుతో పాటు రెండు బైకులు, తొమ్మిది సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

బోధన్‌ మండలంలో..

బోధన్‌ రూరల్‌: మండలంలోని కలదుర్కి గ్రామంలో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న 10మందిని అరెస్ట్‌ చేసినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6,600 నగదు, 8సెల్‌ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బోధన్‌ పట్టణంలో..

బోధన్‌టౌన్‌: పట్టణ శివారులోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సోమవారం పట్టణ సీఐ వెంకట నారాయణ, ఎస్సై హబీబ్‌, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1950 నగదు, 4 ఫోన్లు, ఒక బైక్‌, ఒక కార్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

రెంజల్‌(బోధన్‌): మండలంలోని కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రాన్స్‌ఫార్మర్‌ను రెండు రోజుల కిందట గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, కాపర్‌ వైరును చోరీ చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆదివారం రాత్రి స్థానిక రైతులు గుర్తించారు. సోమవారం ఉదయం ఎత్తిపోతల చైర్మన్‌ గయాస్‌కు తెలుపగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దుకాణ యజమానులకు జైలుశిక్ష
1
1/2

దుకాణ యజమానులకు జైలుశిక్ష

దుకాణ యజమానులకు జైలుశిక్ష
2
2/2

దుకాణ యజమానులకు జైలుశిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement